బౌద్ధం-ప్రజాస్వామ్య భావన


✍️ అరియ నాగసేన బోధి


రాజ కుటుంబం నుంచి అంతఃపురాలను వదిలి అడవి బాట పట్టిన సత్యాన్వేషి సిద్ధార్థుడు. తన 29 వ ఏట తనయుడు రాహుల్ ను భార్య యశోధరను,తల్లిదండ్రులు శుద్ధోధనమహోరాజు-మహాప్రజాపతి గౌతమిలను,శాక్య రాజ్యాన్ని,బంధుమిత్రులు, రాజ్య ప్రజలను త్యజించారు సిద్ధార్థుడు.అకడమిక్ బుక్స్ లలో బుద్ధుడు, బౌద్ధం గురించి స్పష్టంగా గాని పూర్తిగా గాని చెప్పలేదు. ఎందుకంటే వేటగాడు నుండి అకడమిక్ బుక్స్ తయారు అవడమే దానికి కారణం. సింహాల నుంచి చరిత్రకారులు తయారు కానివ్వడం లేదు ఈ వ్యవస్థ. అందుకు రాజ్యమే కారణం.రాజ్యం మూడు, నాలుగు శాతం లేని వ్యక్తుల చేతుల్లో ఉంది. మెజారిటీ ప్రజలకు మేలు చేయడం లేదు. అందుకే సత్యాన్ని సత్యంగా కాకుండా వక్రీకరించి చెబుతున్నారు.మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఒకటే ఉంది మెజారిటీ బహుజనుల పాలన రావాలి. అది ఒకే పార్టీ కింద మాత్రమే వస్తోంది. చెంచాల, వ్యక్తిగత స్వార్థం కోసం బ్యానర్ లు సంఘాలు, రాజకీయ పార్టీలు పెట్టడం మానుకోవాలి.


సిద్ధార్థుడు తన ఆరు సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత జ్ఞానోదయం పొందారు. కేవలం తపస్సు వలనే కాకుండా సమాజంలో అసమానతలు, వ్యక్తి లో దుక్ఖం, దుక్ఖం నిరోధం ,దుక్ఖనిరోధ మార్గాన్ని కనిపెట్టారు.తన స్వీయ అనుభవాలు నుంచి సమాజాన్ని పరిశీలించి ఒక కొత్త జీవన విధానాన్ని మనుషుల సుఖం ,సంతోషాల కోసం కృషిచేశారు. తన జీవితంలో సమారు 45 సంవత్సరాల పాటు ధమ్మాన్ని ప్రచారం చేశారు. అలా సిద్ధార్థుడు బుద్ధుడై లోక కల్యాణం కోసం తాను ఒక భిక్ఖు సంఘాన్ని ఏర్పరిచారు. ఈ భిక్ఖు సంఘం లో నాయకుత్వం గాని తన తర్వాత వారసత్వం గాని లేకుండా ప్రజాస్వామ్య భావనలు ప్రవేశ పెట్టారు.


బుద్ధుని కాలం నాటికి రాజరిక నియంతల పాలన మన భారతదేశం లో ఉండేది. భగవాన్ బుద్ధుని బోధనలు రాజరిక పాలకులకు చావు దెబ్బ. అయితే బుద్ధుడు ఏనాడూ రాజకీయ విషయాలలో జోక్యం చేసుకోకుండా వ్యవహరించారు. తన భిక్ఖు సంఘాన్ని మాత్రం పూర్తి ప్రజాస్వామ్య భావనలు పెంపొందించేలా తీర్చిదిద్దారు. బుద్ధుడు వర్ణ ఆధిక్యతను తిరస్కరించారు. కుల వ్యవస్థను వ్యతిరేకించారు. ఆయన నడిపిన భిక్ఖు సంఘం స్వయం పాలక ప్రభుత్వానికి దారి తీసింది. ఈనాటి పార్లమెంటరీ వ్యవస్థను రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి బౌద్ధ అసెంబ్లీలను చూసే ఏర్పాటు చేశారు డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు. ఇప్పటి పార్లమెంట్ ఓటింగ్ విధానం అంతా నాటి బౌద్ధ అసెంబ్లీ నుంచి తీసుకున్నదే.బౌద్ధ విహార అసెంబ్లీలో బౌద్ధ భిక్ఖువులు మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఓటింగ్ విధానం నాడు బుద్ధుడు ప్రవేశ పెట్టారు. ఇది గొప్ప ప్రజాస్వామ్య భావన.అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు మెజారిటీ సభ్యులు ఓటింగ్ విధానం ద్వారా అధిక సభ్యుల ఓటుతో నిర్ణయం తీసుకోవడం ఆనాడు పాటించారు.ఇది బౌద్ధ అసెంబ్లీలో మామూలుగా జరిగేవి.ఇప్పుడు మనం వేస్తున్న రహస్య ఓటింగ్ విధానం కూడా ఆనాడు బౌద్ధుల మాములుగా పాటించే వారు.అయితే ఈ రహస్య ఓటింగ్ విధానాన్ని నేటి బ్రాహ్మణ శక్తులు ముందే పసిగట్టాయి.ఈ రహస్య ఓటింగ్ విధానం ద్వారా న్యాయం ,ధర్మం ,సత్యం గెలుస్తాయి.అలాగే మెజారిటీ ప్రజలకు న్యాయంగా బహుజనులకు రాజ్యాధికారం లభించడం ఖాయం.ఈ విషయం బహుజనుల కన్నా ముందే మూడు ,నాలుగు శాతం కూడా లేని బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్యులు పసి గట్టారు ఎలాగైనా సరే ఈ రాజ్యం మేము మాత్రమే అనుభవిస్తూ శాశ్వతంగా ఈ దేశ మూల నివాసీ బహుజనులను బానిసలుగా చేయాలని పథకం పన్నారు.అందుకే రహస్య ఓటింగ్ విధానానికి తూట్లు పొడవడానికే EVM మిషన్ లను తెచ్చారు.ఈ మిషన్ లతో ప్రధానమంత్రులు ,ముఖ్య మంత్రులు అవుతున్నారు.బ్రాహ్మణ శక్తులకు బలం లేని చోట వాళ్ళకు అనుకూలంగా ఉండే ఎగువ శూద్ర కులాల నుండి వచ్చిన వ్యాపారస్తులను,భూస్వామ్య శక్తులను ,సంపన్నులను ముఖ్యమంత్రులుగా పెడుతున్నారు.


బుద్ధుడు రహస్య బోధన చేయలేదు. బుద్ధుడు సత్యాన్ని ఇష్టపడ్డారు. సత్యం పట్ల అపారమైన గౌరవం గల బుద్ధుడు రహస్య, బహిరంగ అనే తేడాలు లేకుండా తన ధమ్మాన్ని బోధించారు. బుద్ధుడు వారసత్వ భావనను అంగీకరించలేదు. తన నిర్యాణం తర్వాత తన భిక్ఖు సంఘానికి వారసుణ్ణి ప్రకటించలేదు. తన జీవిత చివరి దశలో కూడా బుద్ధుడు తను ఏర్పాటు చేసిన ధమ్మ వినయాలు మాత్రమే మీకు గురువులుగా దారి చూపుతాయని చెప్పారు.


ప్రజాస్వామ్య భావన వర్థిల్లాలి.
నియంతృత్వ పోకడలు నశించాలి.
వారసత్వ రాజకీయాలు నశించాలి


సంఘం సరణం గచ్ఛామి
ధమ్మ వినయాలు చిరకాలం వర్థిల్లాలి


"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """ """" """ """ """ """ """ """ """ """ 


ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 50, 100, 500 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.


గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl


చందా పంపించిన తరవాత మీ పేరు జిల్లా పేరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అది మా వెబ్సైట్ లోని చందాదారుల లిస్ట్ పై వ్రాయబడను.


Please Help this Website by Donating Rs 50, 100, 500 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl


Please send message on WhatsApp giving your Name & City or District after making Payment so that we shall publish Donors list on our Websites.


Regards


Hemantkumar Baddy
..........................................☘☘☘