నంది మేడారం పంప్ హౌస్ కు కాకా వెంకటస్వామి పేరు నామకరణ చేయాలని : KMAV

కథాలపుర్ 22.12.2023 : దళిత మేధావి కాకా వెంకటస్వామి సేవలు నేమరు వేయడానికి ఆయన వర్ధంతిని రాష్ట్రంలో వివిధ ప్రాంత ప్రజలు జర్పారు. అందులో భాగంగానే శుక్రవారం జిల్లా జగిత్యాల, కథాలపుర్ మండల కేంద్రంలో శంకర్ ఏసీ హాల్ లో కాకా వెంకటస్వామి సంస్మరణ సభ కథాలపుర్ మండల ఐక్య వేదిక (KMAV)  అధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ సందర్భగా కేయంఏవి అధ్యక్షులు మైసా శ్రీధర్  మాట్లాడుతూ వెంకటస్వామి సేవలను యాది చేస్తూ పెద్దపల్లి జిల్లాను "కాకా వెంకటస్వామి జిల్లాగా" నామకరణ చేయాలని అట్లనే నంది మేడారం పంప్ హౌస్ కు కాకా వెంకటస్వామి పేరు నామకరణ చేయాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ఇక ముందు మాట్లాడుతూ కాకాజీ తన హయాంలోనే తొమ్మిది కాలేజీలను డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరున స్థాపించి డొనేషన్స్ లేకుండా విద్య సేవలను అందించారు అందిస్తున్నారు. 

అదే విధంగా కాకాజీ 1969లో తొలిదశ తెలంగాణ పోరాటంలో పోలీస్ కాల్పులకు బులెట్ తగిలి చావు దగ్గరకి వెళ్లి తిరిగి వచ్చారని చరిత్రను వల్లించారు. మలి దశ ఉద్యమంలో సోనియా గాంధీని ఒపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర వహించిన ఘనత వెంకటస్వామి దేనని శ్రీధర్ పేర్కొన్నారు. 

ఈ వర్ధంతి కార్యక్రమంలో కోట శంకర్, కడెం స్వామి, సుఖేందర్, సంజీవ్, మల్లేష్, శ్రీకాంత్, మహేష్, శేశి తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.